తనను జైశ్రీరామ్ అనమని బలవంతపెట్టి.. తన దగ్గరున్న డబ్బులు లాక్కెళ్లారంటూ ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసి వైరల్ చేశాడు. అయితే ఆ ఆకతాయి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఈ ఘటన జరిగింది. అలంగీర్ కాలనీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు తనను 15 మంది హిందూ యువకుడు చుట్టుముట్టి కొట్టారని… జైశ్రీరామ్ అనాలని బలవంతం చేశారని..ఒప్పుకోనందుకు 17 వందల రూపాయలు లాక్కుని వెళ్లారని ఏడుస్తూ వీడియో చేశాడు. అందులో కొందరు అతన్ని కొడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. అంతేకాదు తనపై దాడిచేసిన వ్యక్తి పేరు రాహుల్ అని, అతను అంబేద్కర్ నగర్లో ఉంటాడనీ అందులో పేర్కొన్నాడు.
అసలైతే ఏప్రిల్ 28న జల్గావ్ రోడ్లోని శరద్ టీ పాయింట్ వద్ద అక్బర్ లంగడా (హర్సుల్) సద్దాం, మరొక గుర్తు తెలియని యువకుడు ఇమ్రాన్ను కొట్టారు. వారు అతని జేబులో నుంచి 1,700 రూపాయలను కూడా లాక్కెళ్లారు. దీని తర్వాత ఇమ్రాన్ సిడ్కో పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘటన గురించి కానిస్టేబుల్ సులానేకి తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ లో ఉన్నప్పుడు అతను ఒక ఫేక్ వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ను 15 మంది యువకులు కొడుతున్నట్టు ఉంది. ఆ యువకులు ఇమ్రాన్ఖాన్ను కొడుతూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్టు ఉంది. వారు సిడ్కో బస్ స్టేషన్ నుండి అతనిని వెంబడించినట్లు తీసాడు.
ఈ వీడియోను గుర్తించిన క్రైం బ్రాంచ్, సిడ్కో పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ ముగిశాక ఆ వీడియోలో ఇమ్రాన్ ను కొడుతున్న యువకులంతా ముస్లింలే అని తేలింది. వెంటనే పోలీసులు అతన్ని విచారించారు. నిందితుడు ఇమ్రాన్ ఖాన్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు, తనను కొందరు యువకులు కొట్టారని.. జై శ్రీరామ్ అని చెప్పమని బలవంతం చేశారని నకిలీ వీడియోను చిత్రీకరించమని ఎవరో అడిగారని అంగీకరించాడు.
ఈ మేరకు ఇన్స్పెక్టర్ శంభాజీ పవార్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఘయాల్ కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం తోపాటు నకిలీ వీడియోను రూపొందించి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినందుకు ఇమ్రాన్ ఖాన్పై కేసు నమోదైంది. ఇమ్రాన్ ఖాన్ను సిడ్కో పోలీసులు అరెస్టు చేశారు.