బీజేపీ విజయంతో సంబరాలు చేసుకున్న ఓ ముస్లింను పొరుగువాళ్లే కొంటి చంపిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఖుషీనగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి కథఘర్హికి చెందిన బాబర్ అనే యువకుడు బీజేపీ సపోర్టర్. యోగీ విజయం కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో గ్రామంలో మిఠాయిలు పంచి సంబరాలు చేశాడు. అందుకు ఓర్వలేని ఇరుగుపొరుగే అతన్ని కొట్టి చంపారు. మార్చి 20న అతనిపై దాడి చేయగా స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి, తరువాత లక్నోకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను చనిపోయాడు.
అతను చనిపోయిన తరువాత కూడా వారి ఆగ్రహం చల్లారలేదు. మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకూ స్థానిక ముస్లింలెవరూ రాలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే పీఎన్ పాఠక్ రంగంలోకి దిగారు. కుటుంబసభ్యులకు నచ్చజెప్పి బాబర్ మృతదేహాన్ని ఇల్లు చేర్చారు. స్థానిక అధికారుల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే స్వయంగా అతని మృతదేహాన్ని మోశారు.
https://twitter.com/CNNnews18/status/1508061130970775556?s=20&t=MQgDBwW_idR5TGZDibtT7w
తమ కుమారుడు బీజేపీకి ప్రచారం చేయడం తమ బంధువులకు, స్థానిక ముస్లింలెవరికీ ఇష్టం లేదని..ప్రచారానికి వెళ్లవద్దని హెచ్చరించారని బాబర్ తల్లిదండ్రులు వాపోయారు. అసలైతే రాంకోలా పోలీసుల భద్రతను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. ఇక ఫలితాలు వెల్లడైన తరువాత బాబర్ ఊరంతా స్వీట్లు పంచాడు. దీంతో మరింత రగిలిపోయిన ఇరుగుపొరుగు ఆతనిపై దాడి చేసి ఇష్టంవచ్చినట్టు కొట్టారు. పైకప్పునుంచి కిందకు విసిరారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాబర్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. నిందితులపై అతని భార్య రాంకోలా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.
https://twitter.com/PNPathakBJP/status/1508009000373145604?s=20&t=0625AHNPTPlZlQ-yB7BGtQ
నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని పోలీసులు హామీ ఇచ్చారు. బాబర్ కుటుంబాన్ని ఆదుకుంటామని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాఠక్ తెలిపారు. ఇక ఇప్పటికే ఇద్దరు నిందితులు అయూబ్, తాయెబ్లను గుర్తించారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. మార్చి 21న బాబర్ అలీ భార్య ఫాతిమా ఖాతూన్ చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 323, 504, 452, 336, 308 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
https://twitter.com/kushinagarpol/status/1508082969092657152?s=20&t=mmIpC5viXv2MltP6GM_hZg