పాకిస్తాన్లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ప్రాచీన దేవాలయాల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు స్థానిక ముస్లింలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. గతేడాది డిసెంబర్లో వందేళ్ల క్రితం నాటి ఆలయాన్ని పాక్ ముస్లిం అల్లరి మూకలు ధ్వంసం చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 30వ తేదీన ఖైబర్ పంక్త్వా ప్రావిన్స్లోని కరాక్ జిల్లాలో ఉన్న ఆలయాన్ని వేల సంఖ్యలో ముస్లిం మూకలు దాడికి దిగాయి. అనంతరం ఆలయానికి నిప్పు పెట్టారు దుండగులు. అయితే ఈ ఘటనపై స్థానిక హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో పాక్ సుప్రీంకోర్టు ఘటనను సీరియస్గా తీసుకుంది. ఆలయాన్ని పునర్మించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. దీనిపై ముస్లిం మతపెద్దలు స్థానిక హిందూ సంఘాలతో చర్చలు జరిపారు. జరిగిన సంఘటనకు ముస్లిం మతపెద్దలు క్షమాపణలు చెప్పారు. దీంతో హిందూ సంఘాల నేతలు కూడా నిందితులను క్షమిస్తున్నట్లు తెలిపారు