హిజాబుకు మద్దతుగా అల్లాహు అక్బర్ అని అరిచిన ముస్కాన్ ఖాన్ కు ప్రశంసలతోపాటు బహుమతుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమెకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఇంతకుముందు జమాతే ఉలామా ఇ హింద్ ఆమెకు 5 లక్షల రివార్డ్ ప్రకటించింది. కర్నాటక మాండ్యాకు చెందిన ముస్కాన్ హిజాబ్ కు మద్దతుగా నినాదాలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హిందూ విద్యార్థులకు భయపడకుండా ముందుకు సాగిన ధైర్యశాలి అని అభివర్ణిస్తూ మహారాష్ట్రా బాంద్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దికి మాండ్యాలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఒక ఐ ఫోన్ ను, స్మార్ట్ వాచ్ ను అందించాడు. తనను స్వయంగా అభినందించేందుకే మహారాష్ట్రనుంచి ఇంతదూరం వచ్చానని ఆయన చెప్పారు. కర్నాటక, యావత్ దేశం ఆమె చర్యను స్వాగతిస్తోందన్నారు. ఎవరైనా సరే తనలా ధైర్యంగా ఉండాలని..ఎలాంటి అన్యాయం జరుగుతున్నా ధైర్యంగా తిప్పికొట్టాలని అన్నారు. ఆమెపై అభినందలు కురిపించిన ఎమ్మెల్యే హిందూ విద్యార్థులను క్రూరులంటూ మండిపడ్డారు. హిజాబ్ ధరించడం ముస్లింల రాజ్యాంగ హక్కు అని.. ఆమె వెనక కోట్లాదిమంది ఉన్నారని చెప్పారు.
https://twitter.com/JamiatUlama_in/status/1491079069399920641?s=20&t=NdYGhsc9F__ymIOkokk1RA
అంతకుముందు బుధవారం జమియత్ ఉలమా-ఇ-హింద్ ముస్కాన్ ఖాన్కు 5 లక్షల నగదును ప్రకటించింది.
తన రాజ్యాంగ , మతపరమైన హక్కుల కోసం తీవ్ర నిరసనల మధ్య ముస్కాన్ ఖాన్ లేచి నిలబడిందని అధికారిక అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
PES కళాశాల క్యాంపస్లో ఆమె ఇస్లామిక్ నినాదాలకు ప్రతిస్పందనగా హిందూ విద్యార్థులు “జై శ్రీ రామ్” అని నినాదాలు చేశారు. అయితే తనను బయటి వ్యక్తులు ఇబ్బంది పెడుతుంటే తన క్లాస్ మేట్స్ గురువులు మద్దతుగా నిలిచారని ముస్కాన్ తెలిపింది.