తమిళనాడులో మురుగన్ భక్తుల మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అయింది తమిళనాడు నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో హైందవ సోదర సోదరీమణులు తరలివచ్చారు. లక్షల సంఖ్యలో వచ్చినటువంటి మురుగని భక్తులతో మధురై నగరం కిక్కురిసిపోయింది. మురుగన్ నినాదాలు తో ప్రాంగణం ప్రతిధ్వనించింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మధురై నగరం పులకించిపోయింది.
ఈ ఏడాది జనవరిలో విజయవాడ కేంద్రంగా హైందవ శంఖారావం నిర్వహించారు. దేవాలయాల మీద ప్రభుత్వం ఆధిపత్యం తొలగించాలని, ఇతర మతాల మాదిరిగానే హైందవమత ఆలయాలకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలని హైందవ శంఖారావం డిమాండ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో ప్రాంగణం కిటకిటలాడింది. దేశవ్యాప్తంగా దేవాలయాల స్వేచ్ఛ కోసం చేపడుతున్న ఉద్యమానికి విజయవాడ మొదటి మెట్టు కావాలని అప్పటి జనం ఆకాంక్షించారు. ఇప్పుడు ఇదే తరహాలో మధురైలో కూడా మురుగన్ భక్తుల మహానాడు కార్యక్రమం నిర్వహించారు.
…….
మధురై పార్టీ కోయల్ దగ్గర ఉన్న అమ్మ గ్రౌండ్స్ లో హిందూ మున్నని సంస్థ తరుపున ఈ కార్యక్రమం ఏర్పాటు అయింది. తమిళనాడు హైందవుల అందరిని ఒక చోటకి తీసుకురావడం,, ఐక్యతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని తలపెట్టారు. హిందువులంతా చేసుకునే కార్యక్రమం కావడంతో సహజంగానే తమిళనాడు డిఎంకె ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం ద్వారా భక్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. దీంతో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ తరలి వస్తుండడంతో అధికార యంత్రాంగానికి చెమటలు పట్టేసాయి. మురుగన్ ఫోటోలు పట్టుకుని భజనలు చేసుకుంటూ లక్షల సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. తమిళనాడు లో హిందువుల్లో వచ్చిన చైతన్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
…………
మురుగన్ మహానాడులో తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామలై, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరు నాయకులు.. కొదమసింహాల మాదిరిగా,, వేదిక మీదకు వచ్చి గర్జించడంతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. సాధుసంతువులకు వందనాలు అర్పించి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తమిళంలో ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు.
……
మొత్తం మీద దక్షిణాదిన హైందవ చైతన్యం తక్కువ అన్న వాదనకు కాలం చెల్లుతోంది.. మొన్నటికి మొన్న విజయవాడలో హైందవ శంఖారావం విజయవంతం కావడం,, ఇప్పుడు తమిళనాడులో మురుగన్ మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ కావడం అందరిని ఆకట్టుకుంటుంది. రాగల కాలంలో తమిళనాడులో హైందవ చైతన్యం వెల్లి విరుస్తుందని అంత ఆశిస్తున్నారు.