లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుఘా మఠాధిపతి శివమూర్తికి చిత్రదుర్గ జిల్లా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సెప్టెంబర్ 14 వరకు కస్టడీ విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ కేసులో పోక్సో చట్టంకింద ఏ 1 నిందితుడిగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసింది. తమను లైంగికంగా వేధించారని కేసుపెట్టిన వాళ్లలో ఓ దళిత విద్యార్థి కూడా ఉండడంతో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసును జాతీయ బాలల హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. వారంరోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చిత్రదుర్గ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది కమిషన్.లైంగిక వేధింపులకేసుతో పాటు ఇతర కేసులూ నమోదు కావడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంది . పారిపోయే ప్రయత్నంలో ఉండగా హావేరీ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆయన మఠం చుట్టూ పోలీసు బందోబస్తు పెంచారు.