ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం కొలువైన భ్రమరాంబామల్లికార్జులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లిన ఆమెకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీశైలం ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1607319465796177921?s=20&t=Rsuj6y4qOUMC5mkEl0OI8Q