భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైలట్ వేషధారణలో దర్శనమిచ్చారు. సంప్రదాయ చీరకు బదులు పైలట్ దుస్తులు ధరించి…సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. అసోంలోని తేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె యుద్ధవిమానం ఎక్కారు. సుఖోయ్ విమానం తేజ్పూర్ స్టేషన్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. సుఖోయ్ విమానంలో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్లో ప్రయాణించారు.ముర్ము ప్రయాణించిన సుఖోయ్ MK-30I… రష్యా అభివృద్ధి చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా లైసెన్స్తో నిర్మితమయ్యింది.
ముర్ము మూడురోజుల అసోం పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 6న కజిరంగా జాతీయ పార్కును ప్రారంభించారు. నిన్న ఆమె మౌంట్ కాంచన్జంగా ఎక్స్పెడిషన్-2023ని ప్రారంభించారు. గువాహటి హైకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. గువాహటి నుంచి తేజ్ పూర్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ను సందర్శించారు. ఇక్కడ ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ సుప్రీం కమాండర్కు స్వాగతం పలికారు.
https://twitter.com/rashtrapatibhvn/status/1644590869444698112?s=20