ఒక వార్తా ఛానెల్లో మే 30న జరిగిన చర్చలో మహ్మద్ ప్రవక్తను దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ స్పోక్ పర్సన్ నూపుర్ శర్మపై ముంబ్రా పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
“బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై థానేలోని ముంబ్రా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై IPCలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది” అని ముంబ్రా పోలీసులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1531228839086821376?s=20&t=JmHnVd1C45y2Z7x639KZjQ
ఇమామ్ కౌన్సిల్ సభ్యులు మే 29న ముంబ్రా పోలీస్ స్టేషన్లో అధికారులను కలుసుకుని నూపుర్ కు వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించారు. ఇమామ్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా మరొకరి ఫిర్యాదుపైనా అనేది ఇంకా స్పష్టత లేదు. ముంబ్రాకు చెందిన మహ్మద్ గుర్ఫాన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జర్నలిస్ట్ వరుణ్ సింగ్ నివేదించారు. బీజేపీకి చెందిన నుపుర్ శర్మ వ్యాఖ్యలతో తన మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని గుర్ఫాన్ అన్నాడు.
https://twitter.com/singhvarun/status/1531222966670831616?s=20&t=uLOvhM90Y4X-y3zZLMUI5Q
హింసాత్మక చరిత్ర కలిగిన ఇస్లామిస్ట్ సంస్థ అయిన రజా అకాడమీ ఆదేశాల మేరకు ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని 295A, 153A సహా 505B సెక్షన్ల కింద శర్మపై మొదటి ఎఫ్ఐఆర్ను ముంబై పోలీసులు నమోదు చేశారు.