ముంబై దాదర్ చర్చిలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ కు ముంబై కోర్టు జీవిత ఖైదు విధించింది. 2015లో పాస్టర్ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఫాదర్ జాన్సన్ లారెన్స్ ను దోషిగా తేలుస్తూ పోస్కో కింద శిక్ష విధించింది కోర్టు. మైనర్ పై పాస్టర్ రెండు సార్లు లైంగికదాడి చేసినట్టు నిర్ధారణ అయింది.
2015 నవంబర్ 27న తన సోదరునితో కలిసి చర్చికి వెళ్లానని.. ప్రార్థన చేయిస్తాననే నెపంతో పాస్టర్ తనను మరో గదిలోకి పిలిచి తలుపులు వేసి అత్యాచారం చేశాడని బాలుడు కోర్టుకు తెలిపాడు.
ఇక ఈ ఏడాది నవంబర్లో ఆంధ్రప్రదేశ్ లోని ఓ చర్చిలో దళిత బాలికపైనా లైంగికదాడికి పాల్పడిన పాస్టర్ ను అరెస్ట్ చేశారు. బాలిక ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో దళిత ఉద్యమనేత ప్రేరణ ఎన్సీపీసీఆర్లో ఫిర్యాదు చేశారు.