ప్రాజెక్ట్-75 లోని స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములలో ఆరవదైన INS వాగ్షీర్ ఈరోజు ముంబైలో ప్రారంభించబడింది. ఈ జలాంతర్గామిని ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్(MDL) మేక్ ఇన్ ఇండియా లో భాగంగా నిర్మించింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన రక్షణ శాఖ కార్యదర్శి అజయ్కుమార్ మాట్లాడుతూ జలాంతర్గామి ఆత్మనిర్భర్ భారత్కు నిలువెత్తు నిదర్శనమన్నారు. భారతదేశపు ప్రధాన నౌకానిర్మాణ సంస్థగా MDL ని ప్రశంసిస్తూ సముద్ర నిర్మాణాన్ని స్వదేశీకరించడంలో కంపెనీ భారీ పాత్ర పోషిస్తోందని అజయ్ కుమార్ అన్నారు.
” MDL జలాంతర్గామి ఇప్పుడు చాలా సమగ్రమైన, కఠినమైన పరీక్షలు, అలాగే ట్రయల్స్ను లోనవుతుందని, ఈ ప్రక్రియ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని పేర్కొంది. ట్రయల్స్ పూర్తి పోరాట యోగ్యమైన జలాంతర్గామిని డెలివరీ చేస్తాయి, ఇది అన్ని మోడ్లలో పనిచేయగలదు” అని పత్రికా ప్రకటనలో తెలిపారు.
హిందూ మహాసముద్రంలోని లోతైన సముద్రపు ప్రెడేటర్ అయిన సాండ్ ఫిష్ పేరు మీద వాగ్షీర్ పేరు పెట్టబడిందని MDL తెలియజేసింది. సబ్మెరైన్ వివిధ రకాల మిషన్లను నిర్వహించగలదని, అంటే యాంటీ-సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్ మరియు ఏరియా సర్వైలెన్స్ వంటి వాటిని నిర్వహించగలదని MDL సంస్థ పేర్కొంది.
ప్రాజెక్ట్-75 స్కార్పెన్ ప్రోగ్రామ్లోని నాలుగు జలాంతర్గాములు(కల్వరి, ఖండేరి, కరంజ్ సహా వెలా) ఇప్పటికే భారత నౌకాదళంలోకి ప్రవేశించబడ్డాయి, ఐదవ సబ్మెరైన్ వాగిర్ సముద్ర ట్రయల్స్ దశలో ఉందని కూడా తెలిపింది.