
File Photo
అనారోగ్యంతో కన్నుమూసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలు స్వగ్రామం సైఫైలో అధికారిక లాంఛనాలతో పూర్తి చేశారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ములాయం చితికి నిప్పంటించారు. ములాయంను కడసారి చూసుకునేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. లక్షకుపైగా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, తెలంగాణ సీఎం కేసీఆర్, యోగా గురువు బాబా రాందేవ్ సహా పలువురు ఆయనకు నివాళులు అర్పించారు.
https://twitter.com/ANI/status/1579762840369758211?s=20&t=3ayoJ2xcTI7gbcgrSZ1SbQ