ఎన్నికలు సమీపిస్తున్నవేళ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది..ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ములాయం రెండో భార్య కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ. అఖిలేష్ సతీమణి డింపుల్ కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కనౌజ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. అపర్ణా కూడా గత ఎన్నికల్లో లక్నో కాంట్ నుంచి పోటీచేసి..బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. యూపీలో ఈసారి అధికారం తమదేనంటూ పెద్దెత్తున చేరికలతో జోష్ లో ఉన్న ములాయం కుటుంబానికి ఇది షాకేనని చెప్పవచ్చు.