సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరారు. 1939 నవంబర్ 22వతేదీన జన్మించారాయన. 196నుంచి మొదలు… వరుసగా 8 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మూడుసార్లు యూపీ సీఎంగా పనిచేశారు.
ప్రస్తుతం మొయిన్ పురి ఎంపీగా ఉన్నారు. ములాయం వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు అఖిలేశ్ యాదవ్ కూడా యూపీ సీఎంగా పనిచేశారు.
ములాయం సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు సంతాపం తెలిపారు.
https://twitter.com/narendramodi/status/1579329448390037504?s=20&t=UpOyvUrbqNEVZ4IB47QHiw