వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వేను కోర్టు తప్పనిసరి చేయటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. సమాజ్వాదీ పార్టీ సిద్ధాంతకర్త ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాతా శృంగార్ గౌరీ ఆలయంలో హిందువులు పూజలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 2021లో, ఢిల్లీకి చెందిన రాఖీ సింగ్, మరో నలుగురు మహిళలు ఆలయ ప్రాంగణంలో మా శృంగార గౌరీ విగ్రహాలను ప్రతిరోజూ పూజించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
https://twitter.com/DhootYk/status/1524802484069609472?s=20&t=EnL0I-s9fG7L4_0J_kEomg
ఏడాది పొడవునా మాతా శృంగార్ గౌరీ స్థలంలో ముందు పూజలు నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు బీజేపీ నాయకులు. వర్షిప్ యాక్ట్ 1991ని ఉల్లంఘించిన మాతా శృంగార్ గౌరీ ఆలయంలో సాధారణ పూజలను నిలిపివేయాలని ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ ఆదేశించారని మండిపడుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ ముస్లింలను బుజ్జగిస్తున్నారని శుక్లా ఆరోపించారు, వారి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా 2004లో మాత శృంగర్ గౌరీ వద్ద పూజలను ఆయన ప్రభుత్వం నిషేధించిందని పేర్కొన్నారు. 1992లో బాబ్రీ భవనాన్ని కూల్చివేసిన తర్వాత కూడా ఈ ఆలయంలో ప్రార్థనలు కొనసాగాయని అన్నారు శుక్లా.