అటార్నీ జనరల్ పదవిని తీసుకునేందుకు నిరాకరించారు సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. కేంద్రం ఆఫర్ ను తిరస్కరించడం వెనక ప్రత్యేక కారణం ఏమీలేదని స్పష్టం చేశారు రోహత్గీ. ప్రస్తుతం అటార్నీ జనరల్ గా ఉన్నా కేకే వేణుగోపాలన్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. పదవిలో మరికొంత కాలం కొనసాగడానికి ఆయన నిరాకరించారు. కేంద్రం ఆ బాధ్యత చేపట్టాల్సిందిగా ముకుల్ రోహత్గీని ఆహ్వానించగా ఆయన తిరస్కరించారు. రోహత్గీ గతంలో 2014 నుంచి 2017 వరకు అటార్నీ జనరల్ గా పనిచేశారు. తరువాత కేంద్రం కేకే వేణుగోపాలన్ ను నియమించింది.