బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఆర్మీలో చేరింది. 21 ఏళ్ల ఇషితా అగ్నివీర్ అయింది. త్రివిధ దళాల్లో ప్రవేశం కోసం కేంద్రప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ మంచి స్కీం అని తన కుమార్తెకి కూడా ఇష్టమైతే ఆమెను డిఫెన్స్ లో చూడాలనే కోరిక ఉందని ఈ ఏడాది ప్రారంభంలోనే రవికిషన్ అన్నారు. అయితే ఆమె అందులో భాగం అవడం, శిక్షణ పూర్తిచేసుకోవడం కూడా అయిపోయింది.
జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో, ఢిల్లీ డైరెక్టరేట్లోని సెవెన్త్ గర్ల్స్ బెటాలియన్ క్యాడెట్లలో ఇషిత భాగమని ఆ రోజు పరేడ్ లో తను పాల్గొందని ఆయన గర్వంగా చెప్పారు. తాజాగా తన కుమార్తె డిఫెన్స్ ఫోర్స్లో భాగమైన విషయాన్ని రవికిషన్ ధృవీకరించారు.
ఇషితా శుక్లా ఢిల్లీ యూనివర్సిటీ రాజధాని కాలేజీలో చదివింది. ఎన్సీసీ కేడెట్ కూడా. 2022లో ఎన్సీసీ ఏడీజీ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆమెను వరించింది. సోషల్మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇషిత దేశ సేవ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతుండేది. రవి కిషన్ కూడా తన తనయ గురించిన అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉప్పొంగిపోతారు.
— Ravi Kishan (@ravikishann) June 28, 2023