
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి మరియు RRR రచయిత) మొదటినుండి జాతీయవాది. అందుకే అతని సినిమాల్లో మన దేశ ప్రాచీన సంస్కృతి కి సంబంధించిన దృశ్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే చాలా మంది హిందువుల లాగే ఈయనకి RSS అంటే పడేది కాదు. ఇంకా చెప్పాలి అంటే సుమారు 4/5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈయనకి RSS పై బాగా బాగా వ్యతిరేకత ఉండేది. అందరి లాగే గాంధీ హత్య వెనకాల RSS పాత్ర గురించి అనుమానాలు ఉండేవి.
గత వారం RSS నేత రామ్ మాధవ్ రాసిన ఒక పుస్తకం ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ అందరి ముందు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు నాకు ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా తెలియదు. గాంధీని వారే చంపారని చాలా మందిలాగే నేను కూడా నమ్మాను. అయితే నాలుగేళ్ల క్రితం RSS పై సినిమా కోసం కధ రాయమని నన్ను అడిగారు. దానికి డబ్బు చెల్లిస్తుండడంతో నాగ్పూర్ వెళ్లి మోహన్ భగవత్ని కలిశాను. ఒకరోజు అక్కడే ఉన్నాక ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో మొదటిసారి అర్థమైంది. ఇంత గొప్ప సంస్థ గురించి నాకు చాలా కాలంగా తెలియకపోవడం గురించి నేను చాలా పశ్చాత్తాపపడ్డాను.” అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ లేకపోతే కాశ్మీర్ ఉండేది కాదు, అది పాకిస్థాన్లో విలీనమయ్యేది, పాకిస్తాన్ వల్ల లక్షలాది మంది హిందువులు చనిపోయి ఉండేవారు అని ఆయన అన్నారు..
“ఆర్ఎస్ఎస్ ఒక తప్పు చేసింది, అది ప్రజలతో నేరుగా మాట్లాడకపోవడమే, ఈ లోటును నేను వీలైనంత వరకు సినిమా/వెబ్ సీరీస్ ద్వారా భర్తీ చేస్తాను. దాని కోసమే రెండు నెలల్లోనే కథ రాయడం పూర్తి చేశాను. దాని ఆధారంగా RSS పై ఒక సినిమా, ఒక వెబ్సిరీస్ తీస్తున్నాను అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని మనమందరం గర్వంగా చెప్పుకోగలమని నేను హామీ ఇస్తున్నాను.
ఈ చిత్రానికి “భగవా ధ్వజ్” అనే టైటిల్తో తానే దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ గురించిన ఆకట్టుకునే కథనం తనను మళ్లీ దర్శకత్వం వహించేలా చేసిందని, ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ఇంకా ప్రారంభం కాలేదని ఆయన అన్నారు.
….చాడా శాస్త్రి….