జైపూర్ పట్టణం లో కొలువైన మోతీదుంగ్రీ గణేష్ దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. గర్భాలయంలో ఉన్న స్వామి వారు సింధూర వర్ణంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు. స్వామి వారి దివ్యమంగళ రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధవారం విశేష సేవలు కూడా నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో శివుడూ కొలువై ఉన్నాడు. అయితే మహా శివరాత్రికి మాత్రమే దర్శనం లభిస్తుంది.
ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన వినాయక క్షేత్రం..