పిల్లల పరీక్షలు, మార్కులు అనేవి కొంతకాలంగా తల్లితండ్రులకు పరువు ప్రతిష్టగా మారుతున్నాయి. మార్కుల కోసం అదేపనిగా పిల్లల వెంట పడడం పరిపాటిగా మారుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ మార్కుల వెంపర్లాట మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
మరోవైపు కుటుంబాల్లో తిట్టుకోవడం, అరుచుకోవడం, కొట్టుకోవడం అనేది అంతకంతకు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన ప్రేమ అనురాగం కరిగిపోతూ,, కోపతాపాలు పెరిగిపోతున్నాయి . టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ ప్రభావంతో కుటుంబ సభ్యులే శత్రువులుగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆలోచింపచేస్తోంది.
బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి.అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు.ఈ ఘటనలో కూతురు మరణించగా తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తల్లి కూతుర్లు దెబ్బలాట ఇప్పుడు కలకలం రేపుతోంది