ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మురళీధర్ రావు రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. కేంద్రంపై అనవసరంగా నిందలు వేస్తూ రైతుల్లో వ్యతిరేకత పెంచాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎక్కువగా తెలంగాణనుంచే బియ్యం సేకరణ జరుగుతుంటే వివక్ష ఎక్కడిదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణనుంచే అత్యధికంగా బియ్యం సేకరించిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని అందుకు అంగీకరించి సంతకం చేసిన విషయం నిజం అవునా కాదా అన్నది టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేయాలన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)