ఉక్రెయిన్ నుంచి దాదాపు 60 శాతానికి పైగా భారతీయులు సరిహద్దు దాటి వచ్చారని అందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. మిగిలిన వారినీ తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన కేరళీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు, కేరళ హైకోర్టు అడ్వకేట్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో కేరళ హైకోర్టుకు తెలిపింది కేంద్రం.
ఉక్రెయిన్లో 2 వేల మంది భారతీయులుండగా… 30 శాతం మంది ఇప్పటికే చేరుకోగా… 30 శాతం మంది ఉక్రెయిన్ పొరుగు దేశాల్లో ఉన్నారని కేంద్రం పేర్కొంది. మిగిలిన 40 శాతం భారతీయుల్ని కూడా భద్రంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని కేరళ హైకోర్టుకు తెలిపింది కేంద్రం. యుక్రెయిన్లోని ప్రతి భారతీయుడిని రక్షించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అసలైతే యుద్ధానికి ముందే ఆ దేశాన్ని వీడాలని ప్రకటన జారీ చేసింది ఇండియన్ ఎంబసీ.
ఇక యుద్ధం ప్రారంభమైన వెంటనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును ప్రారంభించింది. ఆ ఒక్కరోజే 470 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చారు. ఉక్రెయిన్ నుంచి రొమేనియా మీదుగా తరలింపు మొదలైంది.
28 ఫిబ్రవరిన ఆపరేషన్ గంగ లో భాగంగా.. రొమేనియా, పోలాండ్, హంగేరీ తదితర పొరుగు దేశాలైన ఉక్రెయిన్లోకి వెళ్లిన భారతీయులను తరలించడం మొదలైంది. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్తో పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
ఉక్రెయిన్లోని ఖార్కివ్లో పరిస్థితి భయంకరంగా ఉందని… అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కేంద్రానికి తెలిపారు. ఉక్రెయిన్లోని భూ సరిహద్దుల్లో అనేక మంది భారతీయులు చిక్కుకున్న వివరాల్నీ ఇచ్చారు. వ్యవస్థల విచ్ఛిన్నంతో పాటు వాతావరణ పరిస్థితులూ అందుకు కారణం.
12000 మంది భారతీయులు యుద్ధం మధ్య ఉక్రెయిన్ను విడిచిపెట్టి సురక్షితంగా ఉన్నారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా కూడా తెలిపారు. అలాగే రొమేనియా, హంగేరి, స్లోవేకియా, పోలాండ్లోని భారత రాయబార కార్యాలయాలు భారతీయ తరలింపు బాధ్యత తీసుకున్నారు. అక్కడున్న వారికి కావల్సిన తిండీ, ఆశ్రయం వంటి వసతులు కల్పిస్తూ క్షేమంగా ఇల్లు చేరేలా రెస్క్యూ విమానాల కోసం ఏర్పాటు చేశారు. అందుకు భారతీయ సంక్షేమ నిధిని వినియోగిస్తున్నారు.
‘ఆపరేషన్ గంగా’ కింద పోలాండ్, మోల్డోవా, హంగేరి సహా రొమేనియాలలో తరలింపు ప్రయత్నాలను సమన్వయం చేయడానికి నలుగురు కేంద్ర మంత్రులను పంపారు. ఈ వివరాలన్నింటినీ కేరళ హైకోర్టుకు తెలిపింది కేంద్రప్రభుత్వం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)