దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA) కింద ఉన్నటువంటి
ప్రాంతాలను తగ్గించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను షా వరుస ట్వీట్లలో ప్రశంసించారు. నాగాలాండ్, అస్సాం సహా మణిపూర్ రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు, అదే సమయంలో ఈ రోజును ‘Momentous Occasion’గా పేర్కొన్నారు.
https://twitter.com/AmitShah/status/1509453316325257220?s=20&t=zvz359lyywS9PM3divpPXw
“ఒక ముఖ్యమైన దశలో, దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం మరియు మణిపూర్ రాష్ట్రాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(AFSPA ) జాబితాలో ఉన్న ప్రాంతాలను తగ్గించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది” అని షా ట్వీట్ చేశారు.
https://twitter.com/AmitShah/status/1509453131515822088?s=20&t=zvz359lyywS9PM3divpPXw
ఈ చర్యను హోం మంత్రి అమిత్ షా సమర్థిస్తూ, “AFSPA పరిధిలోని ప్రాంతాల తగ్గింపు అనేది మెరుగైన భద్రతా పరిస్థితులు, తిరుగుబాట్ల అంతం కొరకు చేసిన అనేక ఒప్పందాల ఫలితంగా వేగంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందటం వల్లే ఇది సాధ్యపడింది” అని అన్నారు.
https://twitter.com/AmitShah/status/1509453247312203780?s=20&t=zvz359lyywS9PM3divpPXw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)