సామాన్య ప్రజలను ఆదుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే భారత బ్రాండ్ ద్వారా బియ్యం గోధుమలు వంటి ఆహార ధాన్యాలను చాలా తక్కువ ధరకు నాణ్యమైన రీతిలో అందించడం జరుగుతోంది. తాజాగా శనగ పప్పు, కంది పప్పు వంటి పప్పు ధాన్యాలు అందించ బోతున్నారు. శనగ పప్పు ను కిలోకు 58 రూపాయలు, కంది పప్పు కిలోకు రూ.89కి రిటైల్లో విక్రయించనున్నారు. బఫర్ స్టాక్ నుంచి సబ్సిడీ ధరకే విక్రయిస్తారు. ప్రభుత్వం సహకార సంఘాలకు 3లక్షల టన్నుల శనగ పప్పు, 68వేల టన్నుల కంది పప్పు ను కేటాయించింది.
విడతల వారీగా ఈ ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు ను అందుబాటులోకి తీసుకుని వస్తారు. ఈ పథకం కింద భారత్ బ్రాండ్ ఉత్పత్తులను పదిరోజుల్లో దేశవ్యాప్తంగా రిటైల్ చేయాలనేది ప్లాన్. శనగ పప్పు కు భారీగా డిమాండ్ ఉన్నందున సబ్సిడీ కింద అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు . ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు, రిటైల్ స్టోర్లతో రీచ్ను విస్తరించేందుకు చర్చలు జరుపుతున్నారు. భారత్ బ్రాండ్ తొలి దశను కేంద్రం గతేడాది అక్టోబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. బియ్యం, గోధుమ పిండితో పాటు పప్పులను ప్రభుత్వం రిటైల్ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి దశలో భారత్ బ్రాండ్ పిండిని కిలోకు రూ.30, కిలో బియ్యం రూ.70, పప్పులను రూ.93కే విక్రయించింది. అలాగే మార్కెట్లో పెరుగుతున్న ఉల్లిగడ్డలను అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రభుత్వం కిలోకు రూ.35, టమాట రూ.65కే అందుబాటులోకి తెచ్చింది.
మొత్తం మీద రాగల కాలంలో మరిన్ని నిత్యవసర వస్తువులను భారత్ బ్రాండ్ కింద అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితంగా నాణ్యమైన పదార్థాలు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.