ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే వైద్యుడు పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంది. ఆయన గత 50 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఆస్తిని దానం చేసిన తర్వాత.. దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కరోనా విజృంభించినపుడు లాక్డౌన్ సమయంలో మొరాదాబాద్లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని గోయల్ ప్రజలకు ఉచిత సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం కూడా ఆయన ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా దేవి పాటిల్ సహా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంలు గోయల్ను సత్కరించారు.
అరవింద్కు భార్య రేణు గోయల్ తోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తి మొత్తం ధరను లెక్కించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు.