అన్నదాతకు శుభవార్త. అనుకున్న సమయానికే రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది…రైతులకు మంచిరోజులేనని అంచనా వేస్తున్నారు.
అయితే, ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాకపై, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ పేర్కొన్నారు.
ఇది సాధారణ రుతుపవన ఏడాదే అవుతుందని… దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ)లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 16నే భారత వాతావరణశాఖ పేర్కొంది. ఈ అంచనాల్లో 5 శాతం అటూఇటుగా ఉండే అవకాశం ఉందనీ తెలిపింది. భారత్లో వరుసగా రెండేళ్లు సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి.