ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ అనే పేరుతో ఆరు ప్రధాన హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మకు వందనం అనే కార్యక్రమం అమలు శ్రీకారం చుట్టారు. బడికి వెళ్లే పిల్లలు ఉన్న ఇంట్లో అమ్మ పేరుతో ఉన్న అకౌంట్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. పిల్లల చదువుకి అవసరమైన ఫీజు కట్టడంతో పాటుగా విద్యా సామాగ్రి కొనుగోలుకి దీనిని ఉపయోగించుకోవాలి.
ఇందుకోసం అధికారులు నిబంధనలు రూపొందిస్తున్నారు.
ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు ఎన్డీఏ ప్రభుత్వం ‘తల్లికి వందనం’కార్యక్రమం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థి తల్లికి ₹15వేలు ఆర్థిక సాయం ప్రతీ ఏడాది ఇస్తామని హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో ఈ హామీ ఒకటి. తల్లికి వందనం పథకంలో భాగంగా స్టూడెంట్ కిట్ కూడా అందించనుంది. ఇప్పటికే స్కూల్స్ తెరిచిన నేపథ్యంలో ప్రభుత్వం పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలని ఆదేశించింది. ఆధార్ లేకపోతే ఆధార్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది
అర్హులైన కుటుంబాలు అన్నింటికీ ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తల్లికి వందనం పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి.. పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి ₹15 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని కండిషన్ పెట్టింది. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ, ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నారు. పాఠశాలలో విద్యార్థి 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం కింద ₹15,000 అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మొత్తం మీద ఈ పథకం అమలు చేయడం ద్వారా మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. అందుచేత ఆలస్యం కాకుండా ఈ పథకం అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు.