విదేశాంగ కార్యదర్శిగా నేపాల్లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో క్వాత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత రాయబారిగా ఫ్రాన్స్కు వెళ్లే ముందు 2015 నుంచి 2017 వరకు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో పనిచేశారు క్వాత్రా. అంతకుముందు 1993 నుండి 2003 మధ్య, ఆయన ఐక్యరాజ్యసమితితో వ్యవహరించే ప్రధాన కార్యాలయంలో డెస్క్ ఆఫీసర్గా పనిచేశారు. తరువాత దక్షిణాఫ్రికా, ఉజ్బెకిస్తాన్లోని దౌత్య విధుల్లో ఉన్నారు. 2003 నుండి 2006 మధ్య, బీజింగ్ రాయబార కార్యాలయంలో కౌన్సెలర్గా, తరువాత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేశారు. 2006 నుండి 2010 వరకు, ఆయన నేపాల్లోని సార్క్ సెక్రటేరియట్లో ట్రేడ్, ఎకానమీ, ఫైనాన్స్ బ్యూరో అధిపతిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. మే 2010 నుండి జూలై 2013 వరకు, వాషింగ్టన్లోని రాయబార కార్యాలయంలో ఉన్నారు.
జూలై 2013 నుండి అక్టోబర్ 2015 మధ్య వరకు, క్వాత్రా విదేశాంగ మంత్రిత్వ శాఖ పాలసీ ప్లానింగ్ & రీసెర్చ్ విభాగానికి నాయకత్వం వహించారు. తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అమెరికా విభాగానికి అధిపతిగా పనిచేశారు. అక్కడ అమెరికా, కెనడాలతో భారతదేశ సంబంధాలను పర్యవేక్షించేవారు. అక్టోబర్ 2015 నుండి ఆగస్టు 2017 వరకు, క్వాత్రా భారత ప్రధాన మంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆగస్టు 2017 నుండి ఫిబ్రవరి 2020 వరకు, ఫ్రాన్స్లో భారత రాయబారిగా ఉన్నారు. మార్చి 2020 నుంచి ఇప్పటివరకు నేపాల్ లో భారతరాయబారిగా పనిచేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)