మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ను సీతాపూర్ తరలించారు డిల్లీ పోలీసులు. గతేడాది మేలో ముగ్గురు హిందూసాధువులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు జుబైర్. దీంతో అతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ పై విరుచుకుపడుతూ మే 27న ట్వీట్ చేసిన జుబైర్… యతి నరసింహానంద సరస్వతి, మహంత్ బజరంగ్ ముని ఆనంద్ స్వరూప్లు విద్వేషాలు పెంపొందిస్తున్నారని అన్నారు. “న్యూస్ స్టూడియోస్ నుండి మెరుగైన పని చేయగల యాంకర్లు మనకుండగా… మతానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధరమ్ సంసద్ను ఏర్పాటు చేయడానికి యతి నరసింహానంద సరస్వతి , మహంత్ బజరంగ్ ముని లేదా ఆనంద్ స్వరూప్ వంటి ద్వేషపూరిత వ్యక్తులు ఎందుకు అవసరం? .” అని ట్వీట్ చేశాడు జుబైర్. దీంతో ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదులు రావడంతో కేసు పెట్టారు. జుబైర్ ఉద్దేశపూర్వకంగా సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తిచేస్తున్నాడని…హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా అతని వ్యవహారం ఉందంటూ మండిపడ్డారు నెటిజన్లు కూడా. మహమ్మద్ జుబేర్ ప్రస్తుతం ఢిల్లీలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.