శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధానిమోదీ 12వ తేదీన కర్నాటకలో పర్యటించనున్నారు. బెంగళూరు – మైసూర్ టెన్ లేన్ ఎక్స్ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మాండ్యాలో రోడ్ షోలో, మద్దూరులో జరిగే భారీ బహిరంగసభలోనూ ప్రధాని పాల్గొననున్నారు. జేడీఎ్సకు కంచుకోటగా ఉన్న పాత మైసూరు జిల్లాల్లో ప్రధాని పర్యటనతో బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో మాండ్యాలో పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అంతటా కాషాయ జెండాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. మద్దూరు తాలూకా గెజ్జలగెరె కాలనీలోని 16 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ధార్వాడలో 5వేల కోట్ల పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన హుబ్బళ్ళి రైల్వే ప్లాట్ఫాంను, 1200 కోట్ల ఖర్చుతో 144 గ్రామాలకు తాగునీటిని అందించే పథకాన్ని, రూ.250 కోట్ల ఖర్చుతో ఏర్పాటైన జయదేవ హాస్పిటల్ శాఖను మోదీ ప్రారంభిస్తారు.