ప్రధాని ఇవాళ తన వస్త్రధారణతో కూడా సరికొత్త సందేశాన్నిచ్చారు. రీ సైకిల్డ్ సీసాలతో తయారు చేసిన జాకెట్ ధరించి ఆయన పార్లమెంట్ కు హాజరయ్యారు. లేత నీలంరంగులో ఉన్న ఆ జాకెట్ ఆకట్టుకునేలా ఉంది. దానిపై హరిత సందేశం అని రాసి ఉంది. వాతావరణ మార్పులను నియంత్రించాలనే లక్ష్యాన్ని మోదీ ఆచరిస్తూవస్తున్నారు. ఇక రీసైకిల్డ్ PET బాటిల్స్ తో తయారు చేశారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఆయనకు బహూకరించింది. ఐఓసీ ఉద్యోగులు, రక్షణ దళాల సిబ్బంది కోసం వస్త్రాలను తయారు చేసేందుకు 10 కోట్లకుపైగా పెట్ బాటిల్స్ ను రీసైకిల్ చేయబోతున్నారు.