రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వార్ విషయంగా భారత్ తటస్థవైఖరి అనుసరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాసేపట్లో బైడెన్, మోదీ వర్చువల్ విధానంలో సమావేశం కానున్నారు. వార్ విషయమే ప్రధానాంశమైనా….. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం, దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఇతర ప్రపంచ సమస్యలపై ఇద్దరూ చర్చిస్తారని భారత విదేశాంగశాఖ పేర్కొంది.
ఇక మోదీ- బైడెన్ మీటింగ్ కు ముందు 2+2 మంత్రుల సమావేశం జరుగుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా ఢిపెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశంలో పాల్గొననున్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)