దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా వ్యాప్తి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత, వాక్సినేషన్ వివరాలు తెలియజేశారు. పాజిటివిటీ రేటు తగ్గుతుందని, రికవరీ రేటు పెరుగుతుందనే అంశాలను అధికారులు ప్రధానికి వివరించారు.
అధిక పాజిటివిటీ రేట్ ఉన్న ప్రాంతాల్లో టెస్టులను మరింత పెంచాలని మోదీ అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ వ్యుహాలను అమలు చేయాలని మోదీ సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్మికులను అవసరమైన సాధానాలు చేకూర్చాలని కోరారు. వెంటిలేటర్లు,ఇతర పరికరాల వినియోగంపై వారికి శిక్షణ ఇవ్వాలన్న అధికారులను ఆదేశించారు.