
file photo
బీఎఫ్ -7 వేరియంట్ కేసులు 4 నమోదైన నేపథ్యంలో రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది కేంద్రప్రభుత్వం. కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, వైద్యరంగ నిపుణులు ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. క్రిస్మస్ , న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు, రద్దీ నియంత్రణపై కేంద్రం కొన్నిసూచనలతో కూడిన నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విమానాశ్రయాల్లో రాండప్ టెస్టింగ్ ను ప్రారంభించారు. గుజరాత్, ఒడిశాలలో రెండేసి చొప్పున BF 7
నాలుగు కేసులు నమోదయ్యాయి.