గణతంత్ర వేడుకల వేళ దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలు నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని యుద్ధ స్మారకం దగ్గర అమరవీరులకు నివాళ్ అర్పించారు. ఇక ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ప్రత్యేక డూడుల్ ను సిద్ధం చేసింది. గూగుల్ స్పెల్లింగ్ లోని GOGLE ని లోయర్ కేసులో రాసి… 0ని రాష్ట్రపతి భవనం డోమ్ ప్రతిబింబించేలా తీర్చిదిద్దింది.దీన్ని గుజరాత్ కు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ పార్థ్ కొథేకర్ తీర్చిదిద్దారు. ఈ ఆర్ట్ వర్క్ లో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ వంటి ప్రముఖ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.