రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన విందుకు విపక్షాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు..
ఈ విందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము తోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, కేరళ సీఎం విజయన్ ను ఆహ్వానించలేదు. ఏపీ సీఎం జగన్ కు మాత్రం ఆహ్వానం అందింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు కానీ ఆరోగ్య కారణాలరీత్యా రాలేకపోతున్నందుకు మన్నించాలని బదులిచ్చారు పీకే.
దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24న ముగియనుంది. నూతనంగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.