అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జనాలు ఓటెత్తారు. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చినట్లుగానే.. జనం పెద్ద సంఖ్యలో ఓటింగ్ పండుగలో పాల్గొన్నారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు, అసోంలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు.. సాయంత్రం 6.00 గంటలకు ముగిశాయి. అయితే 6.00 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో భారీగా ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించిన లెక్కల ద్వారా తెలుస్తోంది. సాయంత్రం 6.00 గంటల వరకు అసోంలో 72.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. వెస్ట్ బెంగాల్లో 79.79 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
72.14% and 79.79% voter turnout recorded till 6 pm, in the first phase of polling in Assam and West Bengal Assembly elections, respectively: Election Commission of India.
— ANI (@ANI) March 27, 2021
Poll ends for the first phase of #AssamAssemblyElections2021; latest visuals from polling booth number 10 in Jorhat. pic.twitter.com/XYE5J7rj7r
— ANI (@ANI) March 27, 2021