ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమిపూజ చేయడంతో పాటు జాతికి అంకితం ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించారు. అనంతరం జింఖానా గ్రౌండ్స్ లో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈసందర్బంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జింఖానా గ్రౌండ్ ను సందర్శించిన పార్టీ చీఫ్ సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, పార్టీ ముఖ్యులతో చర్చించారు.