108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. తుకాడోడీ మహారాజ్ నాగ్పూర్ విశ్వ విద్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సంవత్సరం మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశం ఐఎస్సి ప్రధాన ఇతివృత్తం. సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత సాధనలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.పిల్లల్లో శాస్త్రీయ ఆసక్తి, స్వభావాన్ని పెంపొందించడానికి కూడా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. గిరిజన మహిళల సాధికారతపై దృష్టిసారించడంతో పాటు దేశీయ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ, అభ్యాసాల శాస్త్రీయ ప్రదర్శనకు గిరిజన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించనున్నారు.