గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరిదశ పోలింగ్ ఇవాళ ముగిసింది.ప్రధాని మోదీ ఇవాళ అహ్మదాబాద్ లోని రాణిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. పోలింగ్ కేంద్రానికి కొద్దిదూరంలో వాహనం నిలిపి అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లారు మోదీ. ఆయన్ని చూసేందుకు వందలాదిగా జనం అక్కడికి చేరుకోగా వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారాయన. పోలింగ్ కేంద్రం దగ్గర కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి వెళ్లి ఓటేశారు ప్రధాని. సొంతరాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆదివారమే ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. నేరుగా గాంధీ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు మోదీ.
https://twitter.com/narendramodi/status/1599620971711037441?s=20&t=llMHCs7OQQSzfszhs3liyA