మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని యూరప్ వెళ్లారు. జర్మనీతో ఆయన పర్యటన మొదలైంది. తెల్లవారుజామున డిల్లీ నుంచి ఆయన జర్మనీ బయల్దేరారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది.
PM @narendramodi emplanes for Berlin, where he will take part in various programmes aimed at strengthening India-Germany cooperation. pic.twitter.com/zuuAASvdAq
— PMO India (@PMOIndia) May 1, 2022
సోమవారం నుంచి మూడు రోజుల పాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటిస్తారు. యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సమావేశమవుతారు ప్రధాని. 3,4 తేదీల్లో డెన్మార్క్ లో పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ వెళ్లి ఇటీవలే మరోసారి ఎన్నికైన అధ్యక్షుడు మాక్రాన్ను కలవనున్నారు. మూడు రోజుల పర్యటనలో మొత్తం 25 మంది సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు అంశాలపైనా మోదీ విస్తృతంగా చర్చించనున్నారు.
యూరప్ పర్యటనలో ఆయన ప్రవాస భారతీయులతోనూ భేటీ కానున్నారు. ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో బంధాల బలోపేతమే మోదీ ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వీడేముందు మోదీ చెప్పారు. శాంతి, శ్రేయస్సును కోరుకునే భారత్కు ఆయా దేశాలు ఎంతో ముఖ్యమైన భాగస్వామ్యపక్షాలు అనీ ఆయన అభిప్రాయపడ్డారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)