బెంగళూరు అభివృద్ధికి విశేషకృషి చేసిన నాగప్రభు కెంపెగౌడ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. 108 అడుగుల ఎత్తైన ఆ విగ్రహానికి అభ్యుదయ విగ్రహంగా పేరుపెట్టారు. ప్రముఖ శిల్పకారుడు రామ్ వి సుతార్ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విగ్రహం కోసం 98 టన్నుల కాంస్యం, 12 టన్నుల స్టీల్ ను వాడారు.
ఒకరోజు పర్యటనలో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆయన… కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్-2ను ప్రారభించారు. 5 వేల కోట్ల రూపాయలతో ఈ టెర్మినల్ నిర్మాణం జరిగింది. క్రాంతివీర సంగోల్లి రాయన్న (KSR) రైల్వే స్టేషన్ నుంచి చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దేశంలోని వందే భారత్ ఎక్స్ప్రెస్లలో ఇది ఐదవది కాగా, దక్షిణాదిని తొలిది.
చెన్నై ఇండస్ట్రియల్ హబ్కు, బెంగళూరు టెక్ అండ్ స్టార్టప్ హబ్కు మధ్య వారధిగా ఈ ఎక్స్ప్రెస్ నిలుస్తుందని పీఎంఓ తెలియజేసిందివిధాన సౌధలోని కవి కన్నడదాస, మహర్షి వాల్మీకి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు ప్రధాని.
https://twitter.com/narendramodi/status/1591101954947567619?s=20&t=fytOW99GVE4lg8z0XsWIYg