విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఉత్సవాలు నిర్వహించారు. భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో క్షత్రియ సేవా సమితి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రెండు రోజుల రాష్ట్రీయ కార్యకారిణి బైఠక్ లో పాల్గొనేందుకు శనివారమే మోదీ హైదరాబాద్ వచ్చారు. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచే నేరుగా ఉదయం ప్రత్యేక విమానంలో ఏపీకి వెళ్లారు మోదీ. గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులను మోహరించారు.
Few More Photos from the Event :-