ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 21వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇది PM-KISAN పథకం కింద 11వ విడత.
‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ సిమ్లా చేరుకున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో ప్రధాని ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రభుత్వ ప్రతినిధుల నుంచి అభిప్రాయాన్ని కోరారు.
దేశ పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేరవేయడం, అందజేయడమే సమ్మేళన్ ప్రయత్నం అని పీఎంఓ కార్యాలయం పేర్కొంది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మే 30తో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.