కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లో బిప్లోబీ భారత్ గ్యాలరీని మార్చి 23న ప్రారంభించనున్నారు ప్రధానిమోదీ. షహీద్ దివస్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. గ్యాలరీలో స్వాతంత్య్ర పోరాటంలో విప్లవకారుల సహకారం, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా వారు సాగించిన సాయుధ పోరాట వివరాలు, 1947 వరకు దారితీసిన సంఘటనల సమగ్ర వీక్షణను అందిస్తుంది. విప్లవకారులు పోషించిన ముఖ్యమైన పాత్రను హైలైట్ చేయడమే ఈ కొత్త గ్యాలరీ ముఖ్య ఉద్దేశం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)