తమకు సాయంగా ముందుకు వచ్చిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు భారత ప్రధాని మోదీ.అధ్యక్షుడు బైడెన్ తో ఫోన్లో మాట్లాడారు.ఈ విపత్తు సమయంలో దేశానికి అగ్రరాజ్యం చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపానని, భారత్ చేపట్టిన వ్యాక్సిన్ మైత్రి గురించి వివరించానని మోదీ అన్నారు. ట్విట్టర్ వేదిగ్గా బైడెన్ సైతం స్పందించారు. కరోనాపై యుద్ధంచేస్తున్న భారత్ కు అన్ని విధాలా అండగా ఉంటామని… మనకోసం భారత్ ఉన్నప్పుడు భారతీయుల కోసం మనం ఉండాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ కోసం ముడిసరుకును, ఆక్సిజన్, పీపీఈ, ర్యాపిడ్ టెస్ట్ కిట్లను భారత్ కు అందజేస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇండియాకు అవసరమైన సాయాన్ని అందిస్తామని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ట్విట్టర్ వేదిగ్గా స్పందించారు.
Today, I spoke with Prime Minister @narendramodi and pledged America’s full support to provide emergency assistance and resources in the fight against COVID-19. India was there for us, and we will be there for them.
— President Biden (@POTUS) April 26, 2021