ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్తో మాట్లాడినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలపైన కూడా వివరంగా చర్చించామని పరస్పరం అభిప్రాయాలను షేర్ చేసుకున్నామని మోదీ ట్వీట్ చేశారరు. కోవిడ్-19 మహమ్మారి విషయంలో భారత్-రష్యా మధ్య సహకారంతో పాటు ద్వైపాక్షిక ఎజెండాపై చర్చించాం. ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులను కొనసాగిస్తామనీ అన్నారు. తాలిబన్లకు సహకరిస్తామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. తాలిబన్ల వ్యవహార శైలి, ఇతర ప్రజాస్వామిక దేశాల స్పందన ఆధారంగా ఆ ప్రభుత్వంపై నిర్ణయం తీసుకుంటామని భారతప్రభుత్వం స్పష్టంచేసింది.