వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. వీటితో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు. ‘ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంపొందించడం, తమిళనాడు ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణ అందించడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. విరుధు నగర్, నమక్కల్, ది నిల్గిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్టణం, దిండిగుల్, కల్లకురిచి, అరియలూరు, రామంతపురం, క్రిష్ణగిరి జిల్లాల్లో కొత్త కాలేజీలు నిర్మించారు.
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ క్యాంపస్ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు.