దేవభూమి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించారు భారతప్రధాని మోదీ. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2013 నాటి వరదల్లో విధ్వంసం తరువాత పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల సమాధిని ఆయన ప్రారంభించారు. ఆ విగ్రహం ముందే కాసేపు ధ్యానం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మోదీ. 130 కోట్లతో నిర్మించిన సరస్వతి రిటైనింగ్ వాల్, ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ హౌస్లు, మందాకిని నదిపై గరుడ చట్టి వంతెనలను ఆయన ప్రారంభించారు. కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఇంకా పలు బహుళార్థ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు, స్వామి దర్శనం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. 2022 లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు.
మందాకినీతీరాన ఉన్న కేదార్ నాథ్ ఇక్కడి నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అందుకే యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్, కేదారినాథ్ ఆలయాలను చార్ ధామ్ అంటారు.
ప్రధాని హోదాలో మోదీ కేదారీనాథ్ కు రావడం ఇది రెండోసారి. 2019 పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఆయన మొదటిసారి కేదారినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కొన్ని గంటలపాటు ధ్యానంలో గడిపారు.