మోడీ రాష్ట్రాలకు చెప్పడం లేదు మౌనంగా వున్నాడు. ఒక ఆరోపణ. ఏం చెప్పాలి?
1. రాజ్యాంగం ప్రకారం ఆరోగ్య సంరక్షణ అనేది రాష్ట్ర విషయమని, ఆసుపత్రులు వాటిల్లో ఆక్సిజన్, ఐసియులు, పడకలు, మందులు, వెంటిలేటర్లు, , వంటి సదుపాయాలు చూసుకోవలసింది రాష్ట్రాల బాధ్యత అని మోడీ బహిరంగంగా చెప్పడం లేదు(అంటే రాష్ట్రాలను విమర్శించడం లేదు)
కారణం ? అతను భారతీయులను రక్షించాలనుకుంటున్నందున ఇలా చెప్పడానికి లేదా విమర్శించడానికి బదులుగా అతను కేంద్ర సహకారం అందచేస్తూ రాష్ట్రాల వైఫల్యాలను తాను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు.
2. పోలీసులు రాష్ట్రాల నియంత్రణలోనే ఉంటారని, లాక్డౌన్ను సరిగ్గా అమలు చేయడంతో పాటు బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం కూడా రాష్ట్రాల నియంత్రణలోనే ఉందని మోడీ చెప్పడం లేదు?
3. COVID మార్గదర్శకాలను నిర్ణయించడంలోనూ, నియంత్రణలోను స్వతంత్రత కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు కోరుకున్నాయని అందువల్లే సెప్టెంబర్ 2020 నుండి ఈ కోవిడ్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలే నియంత్రిస్తున్నారని మోడీ బయటకు చెప్పడం లేదు. మరి అప్పుడు అలా కోరిన రాష్ట్రాలు ఇప్పుడు ఎందుకు ఇలా ?
4. కీలక రాష్ట్రాలు అయిన ఛత్తీస్గర్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర లను జనవరి / ఫిబ్రవరి / మార్చిలో సిద్ధంగా ఉండమని హెచ్చరించానని కానీ ఆ నోటిఫికేషన్లపై వారు నిద్రపోయారని మోడీ చెప్పడం లేదు. అతను అందరు సిఎమ్లతో పలుసార్లు సమావేశాలు నిర్వహించాడని కూడా అతను చెప్పడం లేదు. కాని కొందరు సీఎంలు ఆ సమావేశాన్ని బహిష్కరించారని లేదా ప్రధాని చేసిన ఆ హెచ్చరికలను తీవ్రంగా తీసుకోలేదు అని కూడా మోడీ చెప్పడం లేదు.
5. తన ప్రభుత్వం పిఎం కేర్ ఫండ్ ద్వారా రాష్ట్రాలకు సుమారు 50వేల వెంటిలేటర్లను ఇచ్చిందని, వాటిని ఉపయోగించడం గురించి పక్కన పెట్టండి, కనీసం వాటిలో కొన్ని వేలు ప్యాకేజింగ్ నుండి తెరవడానికి కూడా రాష్ట్రాలు కష్టపడలేదని మోడీ చెప్పడం లేదు. పీఎం కేర్ ఫండ్ ద్వారా కోవిడ్ పై భారతదేశం చేస్తున్న పోరాటం కోసం ఇప్పటివరకు పీఎం కేర్ ఫండ్ 7000 ఖర్చు చేశానని మోడీ చెప్పడం లేదు?
6. వాక్సిన్ సరఫరా చేయడానికి ఫైజర్ వంటి సంస్థలు అర్జెంటీనా మరియు బ్రెజిల్ దేశాలపై ఆంక్షలు పెట్టి దోపిడీ చేస్తున్నట్లు మనల్ని కూడా దోపిడీ చేసే ఈ విదేశీ సంస్థలుపై భారతదేశం ఆధారపడకుండా ఉండటానికి అని వ్యాక్సిన్లను మన దేశంలోనే తయారు చేయడానికి తాను స్వయంగా ముందడుగు వేశానని మోడీ చెప్పడం లేదు?
7. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్క పరికరాన్ని ఒక రోజు లేదా రెండు రోజుల లోపు రాష్ట్రాలకు ఇచ్చామని మోడీ చెప్పడం లేదు?
రాష్ట్రాలకు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోడానికి అన్ని అధికారాలు ఉన్నాయని కానీ అవి ఆ అధికారాలను ఉపయోగించి ప్లాంట్స్ ని నెలకొల్పలేదు అని మోడీ చెప్పడం లేదు ?
8. వాక్సినేషన్ ప్రారంభించినప్పుడు ప్రజలలో వ్యాక్సిన్ సంకోచాన్ని తాను సృష్టించలేదని, ఇది ప్రతిపక్ష పార్టీలు చేసింది మరియు దాని కారణంగా చాలా టీకాలు వృధా అయ్యాయి అని
కూడా మోడీ చెప్పడం లేదు?
9. తన చేతిలో ఉన్నవి అంటే కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిలో ఉన్నంతలో కొత్తగా 14 ఎయిమ్స్, (ఇప్పటికే పనిచేస్తున్నవి 11) 90 కొత్త మెడికల్ కాలేజీలు, మెడికల్లో 24000 కొత్త యుజి సీట్లు, 30000 కొత్త పిజి సీట్లు తీసుకువచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాష్ట్రానికి ఎన్నికైన తరువాత హెల్త్ ఇన్ఫ్రాకు ఏమి చేశాయని మోడీ చెప్పడం లేదు. ?
10. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉన్న నిధులను పెంచే ఉద్దేశంతో 2020-2021 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ప్రమాద నిర్వహణ నిధి యొక్క మొదటి విడత వాటా 11,092 కోట్లును కేంద్ర ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిందని మోడీ చెప్పడం లేదు.
11. మోడీ చెప్పాల్సిన విషయాలు ఇలా చాలా ఉన్నాయి కాని అతను ఇతరుల మాదిరిగా కష్ట కాలంలో విమర్శలకు దిగడు కాబట్టి అలా చేయడంలేదు. అతను ప్రస్తుతం అందరి చేత తిట్టబడుతున్నాడు/విమర్షింపబడుతున్నాడు కానీ వాటిని పట్టించుకోకుండా దేశం కోసం తన పని తాను ప్రశాంతంగా చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతను ఈ క్లిష్టమైన సమయంలో ఎటువంటి నింద ఆటలు మరియు రాజకీయాలు ఉండకూడదని అనుకుంటాడు కాబట్టి.
12. ఈ దేశంలోని అన్ని ప్రభుత్వాల పూర్తి దృష్టి ప్రజలను రక్షించడంపై ఉండాలి. మోడీ పరిపూర్ణంగా పని చేస్తూ ఉండకపోవచ్చు కాని ఏ విదేశం కోసమో, కుటుంబం కోసమో భారత్ ప్రజలను మోసం చేయడు దేశ ప్రతిష్ట దిగజార్చనివ్వడు.
గత ఒక్క సంవత్సరంలో ప్రధాని మోడీ చేసిన ఒక పెద్ద తప్పు అంటూ ఏదైనా ఉంటే, అది అతను తన “ముఖ్యమంత్రులను పూర్తిగా విశ్వసించడం”
మా నరేంద్రమోడి తన పట్ల ప్రదర్శిస్తున్న ద్వేషాన్ని కుటుంబ పెద్దగా భరిస్తూనే ఉంటాడు. అంతే కాని ఈ పరిస్థితుల్లో అతను తన రాష్ట్రాలను నిందించడు. అతను పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రమే అతని నిజమైన విలువను మనం అర్థం చేసుకుంటాము. అప్పటి వరకు ప్రతిదానికీ అతన్ని తిడుతూనే ఉండండి.
అదే అతనికి స్ఫూర్తి, బలం, శ్రీ రామరక్ష